నిజంగా అంత ధైర్యం ఉందా..? నిజంగా వారు ఆ కేసుల తుట్టేను కదిలిస్తే చంద్రబాబు చేసే ఎదురుదాడికి తట్టుగోలరా? ఇంతకీ విషయమేంటీ అంటారా? ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీలో ప్రత్యేక హోదా కోరుతూ చేసిన ఒక్కరోజు దీక్ష గురించి బీజేపీ నేతల్లో సీరియస్గా చర్చ నడుస్తోందని టాక్. అది హోదా దీక్ష కాదని.. మోదీకి వ్యతిరేకంగా ఆయన వ్యతిరేక వర్గాలంతా ఒక్కచోట చేరి ఆయనను తిట్టడానికి వేదికగా మారిందని.. దానిని చంద్రబాబు హోదా పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో ఆర్గనైజ్ చేశారని బీజేపీ నేతలకు మండిపోతుందట.
నిన్న మొన్నటి వరకు భుజం భుజం రాసుకొని తిరిగి… హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అంటూ చెప్పి.. భావి భారత ప్రధాని కూడా మోదీనే అని తీర్మాణాలు చేసిన చంద్రబాబు తీసుకున్న యూటర్న్ను కమళనాథులు జీర్ణించుకోలేకపోతున్నారట. హోదా వద్దని చెప్పిన వ్యక్తే .. ఇప్పుడు బీజేపీనే మొత్తం చేసిందంటూ తమను విలన్లుగా చూపాలని చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టాలని చూస్తున్నారట. అందుకే ఎలాగైనా చేసి చంద్రబాబుకు గుర్తుండి పోయేలా ఏదైనా చేయాలనుకుంటున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
చంద్రబాబు ట్రాక్ రికార్డ్ తిరగేస్తే వెన్నుపోటులు, యూటర్న్లే గాక అనేక అవినీతి ఆరోపణలు, సుప్రీం కోర్టులో పెండింగ్ కేసులు ఉన్నాయి. వాటిని కదిలించాలని చూస్తున్నారు. కానీ చంద్రబాబు ఇదంతా ముందుగా గమనించే సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా చూసుకున్నారు. ఎవరో పారిశ్రామిక వేత్తల మీద ఐటీ సోదాలు జరిపితే రాష్ట్రంపై దాడి చేస్తున్నట్టు సృష్టిస్తున్నారు. ప్రజలే రక్షణ కవచాల్లా ఉండాలని కోరుతున్నారు. వీటికి ఆయన మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుంది. మరి ఈ సమయంలో చంద్రబాబును కదిలించే సాహసం బీజేపీ చేస్తుందా? ఆయనకు సానుభూతి పెంచే కార్యక్రమాల జోలికి వెళ్లేంత సీన్ కమళనాథులకు ఉందా?