Tuesday, May 14, 2024
- Advertisement -

‘మహానేత’ను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్నారుః బాబుపై బిజెపి నేత తీవ్ర విమర్శలు

- Advertisement -
  • వైఎస్‌ది హత్య….? మహానేత భూస్థాపితం… విజయమ్మకు నిజం తెలుస్తుందా…?

వైఎస్ రాజశేఖరరెడ్డిది సహజ మరణమా? కుట్ర పన్ని హత్య చేశారా? వైఎస్ రాజశేఖరరెడ్డిది హత్య అని ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ ఆధారాలతో సహా వార్తను ప్రచురించింది. అయితే అప్పటి యూపీఏ ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ కోణంలో చేసిందేమీ లేదు. అయితే ఆ అంతర్జాతీయ వార్తా సంస్థ చేసిన ఆరోపణలు అప్పటి పాలకులను, దేశంలోనే ప్రముఖ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఉండడం, అప్పటి పాలకులు కూడా తూతూ మంత్రంగా విచారణ మమ అనిపించి హత్య కాదు తేల్చిపారేయడం లాంటి విషయాలు ఇప్పటికీ అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి. రీసెంట్‌గా సాక్షికి ఇంటర్యూ ఇచ్చిన విజయమ్మ కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు…..వైఎస్‌ మరణం వెనకాల కుట్ర ఉందా? హత్య చేశారా అనే ప్రస్తావన వైఎస్‌ల ఇంట్లో వచ్చినప్పుడు జగన్ కూడా ఏ విషయం తేల్చిచెప్పలేదట. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ వాళ్ళ చేతుల్లోనే ఉన్నప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదమ్మా అని మాత్రం చెప్పాడట.

ఇప్పుడు తాజాగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన బిజెపి నేత సోము వీర్రాజు……. ఆవేశంగా…..‘మహానేతను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్నారు…..’ అని విమర్శ చేశాడు. సాధారణంగా తెలుగు ప్రజలందరికీ కూడా మహానేత అంటే వైఎస్సారే గుర్తొస్తారు. ఎన్టీఆర్‌ని మహానేత అనడం ఎప్పుడూ లేదు. ఆ విషయం సోమూ వీర్రాజుకు కూడా తెలుసు. రాజకీయంగా చాలా సీనియర్ అయిన సోమూ వీర్రాజు వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. ‘మహానేతను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్నారు’ అన్న సోమూ వీర్రాజు వ్యాఖ్యలు అయితే వైఎస్‌ది హత్యనే అని ఆలోచించే వారిలో మరిన్ని అనుమానాలు రేకెత్తించేలా ఉంది. విడిపోతాం అనేలా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు డ్రామా చేస్తూ, మోడీని కార్నర్ చేస్తున్న టిడిపికి ‘మీ చరిత్ర మొత్తం భయటపెడతాం’ అనే యాంగిల్‌లో కావాలనే సోమూ వీర్రాజు ఈ స్థాయి వ్యాఖ్యలు చేశాడా అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ముందు ముందు సోము వీర్రాజు వ్యాఖ్యలు ఇంకా ఏ రూపు తీసుకుంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -