రాష్ట్రంలో టీడీపీకీ కొరకరాని కొయ్యలా తయారయ్యారు భాజాపా ఎంపీ జీవీఎల్. ఆ పార్టీతో టీడీపీ తెగదెంపులు చేసుఉన్నప్పటినుంచి ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు ఈ ఎంపీగారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్తి ఘనవిజయం సాధించారు.
తాజాగా మరో సారి టీడీపీ, కాంగ్రెస్లను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారని, టీడీపీకి మరో దారుణమైన పరాభవం ఎదురైందని ఎద్దేవ చేశారు.
కాంగ్రెస్ ’తో కలిసి టీడీపీకి ఘోర పరాజయానికి గురైందని, ఆ పార్టీ చెంత చేరిన తెలుగుదేశం పార్టీ అవినీతి గబ్బులో చేరిందని విమర్శించారు. కాంగ్రెస్ చెంతన చేరిన టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని జీవీఎల్ జోస్యం చెప్పారు. రాష్ట్రప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ప్రజలు తిరస్కరిస్తారని, వారి స్కామ్ లపై తాను మాట్లాడుతుంటే వాళ్లెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు సరైన సమాధానాలు చెప్పేంత వరకు వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.