ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై భాజాపా ఎంపీ జీవీఎల్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మోదీపై బాబు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బాబు హస్తిన వెల్లి ఏం సాధించారని జీవీఎల్ ప్రశ్నించారు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని, అనుభవం ఉన్న నాయకుడు ఎంత బాధ్యతగా మాట్లాడాలి? అని ప్రశ్నించారు.
రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను చెప్పకుండా …కేంద్రం ఏం చేయట్లేదంటూ డ్రామాలాడుతున్నారని, ఒక సినిమా చూపించాలని చంద్రబాబు అనుకున్నారని, ప్రజలు, ప్రతిపక్షాలు ఆయనకు అసలు సినిమా చూపిస్తున్నాయని విమర్శించారు.
ప్రజలు, ప్రతిపక్షాలు చూపించిన సినిమాకు భయపడి ఢిల్లీ పారిపోయారని…రేపు సింగపూర్ వెల్తారాని సెటైర్స్ వేశారు.వ్యాపారులు, దొంగ నాయకులపై ఐటీ దాడులు చేస్తే ముఖ్యమంత్రికి ఎందుకంత భయమన్నారు. చంద్రబాబు కోతల రాయుడు, అబద్ధాల రాయుడిగా మిగిలిపోతారన్నారు. ఆంధ్రా విజయ్ మాల్యా సీఎం రమేష్ అని ఎద్దేవ చేశారు.
హాయ్ ల్యాండ్ ను కొట్టేయ్యాలని చూశారని విమర్శించారు. బీజేపీ పోరాటం వల్లే అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలన్న ఆలోచన నుంచి ప్రభుత్వ పెద్దలు వెనక్కి తగ్గారని చెప్పారు. హాయ్ల్యాండ్పై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు గిలగిల కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే అన్ని పార్టీలు ఖండించడం సహజమేనని జీవీఎల్ అన్నారు. జగన్పై దాడి కేసును చంద్రన్న బ్యూరో ఇన్వెస్టిగేషన్తోనే విచారణ చేయిస్తామంటున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.