నగరంలో ఎన్నికల వేడి బాగా రాజుకుంటుంది. పోటీలో నిల్చున్న అన్ని పార్టీ కీలక నేతలు ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, ఎంఐఎం మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ పీవీ, ఎన్టీఆర్ సమాధుల్ని కూల్చాలన్నారు. దీనిపై స్పందించిన బండి సంజయ్ అదే జరిగితే దారుస్సలంను రెండు గంటల్లో కూల్చుతామని ఛాలెంజ్ చేశారు.
ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్లో ఉన్న పీవీ ఘాట్ వద్దకు చేరుకున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పీవీకి ఆయన నివాళులర్పించారు. అంతే కాదు పీవీ, ఎన్టీఆర్ అందరికీ ఆదర్శమన్నారు. అలాంటి గొప్ప నేతల విషయంలో ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు.. ప్రజలు అంతా గమనిస్తున్నారని.. ఈసారి ఆ పార్టీ నేతలకు గట్టి బుద్ది చెబుతారని అన్నారు.
మహా నాయకుల ఘాట్లకు రక్షణగా ఉంటామన్నారు. మీరెంత? మీ పార్టీ ఎంత? అంటూ ఎంఐఎంపై తీవ్రంగా మండిపడ్డారు. దుబ్బాకలో దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారన్నారు ప్రజలు . భాగ్యనగరంలో కూడా అదే జరుగుతుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు.