- Advertisement -
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తాను వస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పడంతో తెలుగు తుమ్ముళ్లు ఫుల్ జోష్లో ఉన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు ప్రకటనపై నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఆయన ప్రచారంతో మహాకూటమి విజయావకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్ పరిధిలో టీడీపీ ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం పలువురు నేతలు చంద్రబాబును కలుసుకుని తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు.