Saturday, April 20, 2024
- Advertisement -

రజినీకాంత్ గొప్పతనానికి నిదర్శనం : సీఎం కేసీఆర్

- Advertisement -

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా ప్రకటించారు. ఓ నటుడిగా, నిర్మాతగా స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు నిరుపమానం.

రజనీకాంత్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు నా ధన్యవాదాలు” అని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజనీకి సిఎం శుభాకాంక్షలు తెలిపారు. 

నటుడిగా రజనీ దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకున్నారని కితాబునిచ్చారు. నేటికీ దేశ, విదేశాల్లో కోట్లాది మంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయమని అన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -