Tuesday, May 14, 2024
- Advertisement -

నంద్యాల్లో.. జగన్ పై వేణు మాధవ్ సెటైర్లు

- Advertisement -

కమెడియన్ వేణుమాధవ్ నంద్యాల ఉపఎన్నికల సందర్బంగా బరిలోకి దిగారు. వేణుమాధవ్ ఒకప్పుడు టాప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమాలకి దూరం అయ్యారు. అయితే టీడీపీ మీద వేణుమాధవ్ అభిమానం పోలేదు. నంద్యాల ఉపఎన్నికల జరుగుతున్నాయని తెలిసి వెంటనే ప్రత్యేక్షంగా చూడాలని వచ్చారు. గతంలో వేణుమాధవ్ టీడీపీ తరుపున ప్రచారం చేశారు.

అయితే ఈ సారి ప్రచారం కోసం.. రాలేదని కేవలం భూమా బ్రహ్మానందరెడ్డి మెజార్టీ ఎంత వస్తుందో చూడడానికి వచ్చానని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ఫై సైలెంట్ గా కొన్ని సెటైర్లు వేశారు.. టీడీపీ తరుపున చంద్రబాబు ప్రచారం చేయాల్సిన అవసరం లేదని జగన్ మోహన్ రెడ్డి ప్రచారం సరిపోతుందని తెలిపారు. జగన్ ప్రచారం లో ప్రతి క్షణం మాటకు ముందు మాటకు వెనుక చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటూ మాట్లాడుతున్నారని వేణుమాధవ్ వ్యగంగా మాట్లాడారు.

ఈ విధంగా టీడీపీ కి జగనే ప్రచారం చేస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. అదే విధంగా జనాలలో కూడా వేణుమాధవ్ చెప్పింది నిజమేనని చర్చించుకుంటున్నారు. అయితే వేణు మాధవ్ చెప్పింది.. జగన్ ను అవమానించినట్లు ఉందని.. వైసీపీ నేతలు వేణు మాధవ్ పై మండి పడుతున్నారు. ఆ మాటకు వస్తే టీడీపీ నేతలు ప్రచారంలో జగన్ ను విమర్శిస్తాలేరా అని ప్రశ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -