కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ కొండా మురళి రాజీనామాకు రంగం సిద్ధమయింది. తనకు పదవులు ముఖ్యం కాదనీ, ఆత్మగౌరవమే ముఖ్యమని మురళీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత దక్కడంలేదని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు కొండా దంపతులు.
శనివారం ఆయన శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. కొండామురళితో పాటు ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఉన్నారు. వరంగల్ స్థానిక సంస్థల ద్వారా కొండా మురళి టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ తరఫున పరకాల నుంచి పోటీచేసిన కొండా సురేఖ పరాజయం పాలయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ.. శాసనమండలి చైర్మన్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకుని తొలగించకముందే గౌరవంగా తప్పుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మురళి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.