Sunday, May 12, 2024
- Advertisement -

మైల‌వ‌రంలో నీచ రాజ‌కీయం చేస్తోన్న దేవినేని ఉమ

- Advertisement -

కృష్ణాజిల్లా మైల‌వ‌రం టీడీపీ అభ్య‌ర్థి దేవినేని ఉమ‌మ‌హేశ్వ‌రరావుకు ఓట‌మి భ‌యం ప‌ట్టుకున్న‌ట్లు ఉంది. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అయిన ద‌గ్గ‌ర‌ నుంచి నీచ రాజ‌కీయాల‌కు పాల్పుడుతున్నారు దేవినేని ఉమ‌. 5 సంవ‌త్సరాలు మంత్రిగా ఉన్న దేవినేని ఉమ మైల‌వరానికి చేసింది మాత్రం శూన్యం. దీంతో ఈసారి ఎన్నిక‌ల్లో ఉమ గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని అన్ని స‌ర్వేలు చెబుతున్నాయి.

పైగా త‌నపై ఈసారి బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్ధిని దించాడు వైసీపీ అధినేత జ‌గ‌న్‌. వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌ను మైల‌వ‌రంలో పోటీకి దించారు జ‌గ‌న్‌. దేవినేని ఉమ‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు వ‌సంత‌ కృష్ణ ప్ర‌సాద్‌. ఈ స‌మ‌యంలోనే ఉమ నీచ రాజ‌కీయాల‌కు తెర‌లేపాడు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ బుధ‌వారం మైల‌వ‌రం నియోజిక వ‌ర్గానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి దేవినేని ఉమ పోలీసుల‌తో క‌లిసి కాసేపు హైడ్రామా న‌డిపించారు. జ‌గ‌న్ ప్ర‌చార స‌భ‌కు చేరోకోకుండా కుయుక్తులు ప‌న్నాడు. దీంతో భారీ సంఖ్య‌లో అక్క‌డికి చేరుకున్న వైసీపీ కార్య‌కర్త‌ల‌పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.

మ‌హిళ‌లు అని కూడా చూడకుండా లాఠీ ఛార్జీ చేశ‌రు పోలీసులు. ఈ ఘ‌ట‌న‌లో చాలామంది గాయ‌ప‌డ్డారు. అనంతరం. వేరే రూట్‌లో స‌భ‌స్థలికి చేరుకున్న జ‌గ‌న్ …మొద‌ట మాట్లాడుతు పోలీసుల‌పై ఫైర్ అయ్యారు. పోలీసులు ఇలా రాజ‌కీయ నాయ‌కుల‌కు తొత్తుగా మార‌రాని ఆయ‌న విమ‌ర్శించారు. ఇక స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమ‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని అందుకే ఇలాంటి పిచ్చి ప‌నుల‌ను చేస్తున్నారని చెప్పుకొచ్చారు జ‌గ‌న్‌. వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌కు ఓటు అఖండ మెజార్టీతో గెలిపించాల‌ని మైల‌వ‌రం ప్ర‌జ‌ల‌ను కోరారు జ‌గ‌న్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -