Sunday, April 28, 2024
- Advertisement -

జ‌గ‌న్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ సీఎం

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు మాజీ సీఎం కొనిజేటి రోశ‌య్య‌. జ‌గ‌న్ వ్య‌క్తిత్వంపై ప్ర‌శంల జ‌ల్లు కురిపించారు. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఆర్య‌వైశ్యులంద‌రూ జ‌గ‌న్‌కు అండ‌గా నిల‌బ‌డాల‌ని పిలుపునిచ్చారు.

జ‌గ‌న్ గొప్ప ప‌ట్టుద‌ల‌గ‌త నాయ‌కుడ‌ని ప్ర‌శంశించారు. త‌న శిశ్యుడు మాజీ ఏపీసీఐఎస్ ఛైర్మెన్ సుబ్ర‌మ‌న్యాన్ని వైసీపీలో చేరాల‌ని త‌నే చెప్పార‌న్నారు. ఆర్య‌వైశ్యుల‌కు ప్ర‌త్యేక కార్పొరేష‌న్ పెట్ట‌డంతోపాటు…రోడ్ల విస్త‌ర‌ణ‌లో న‌ష్ట‌పోయిని వారంద‌రికి న్యాయం జ‌ర‌గాలంటె వైసీపీ అభ్య‌ర్తి శిల్పామోహ‌న్‌రెడ్డిని గెలిపించాల‌ని పిలుపు నిచ్చారు.

రాష్ట్రంలోని ఆర్య‌వైశ్యుల‌పై దాడులు చేస్తూ మామూళ్లు వ‌సూలు చేస్తున్నార‌ని…టీడీపీ ఆగ‌డాలు రోజురోజు మితిమీరి పోయాన‌ని చంద్ర‌బాబుపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. మాచ‌ర్ల‌లో అధికార పార్టీ కుల రాజ‌కీయంతో ఆర్య‌వైశ్య కుటుంబాన్ని చంచేశార‌ని…టీడీపీకి త‌గిన బుద్ది చెప్పాల‌ని ఓట‌ర్లుఉ పిలుపు నిచ్చారు.

రోశ‌య్య పిలుపుతో ఆర్య‌వైశ్యులంద‌రూ మూకుమ్మ‌డిగా వైసీపీ అభ్య‌ర్తికే ఓట్లు వేస్తామ‌ని ముక్త‌కంఠంతో తెలిపారు. శిల్పా  గెలిస్తే అసెంబ్లీలో నంద్యాల గురించి పోరాడ‌వ‌చ్చ‌న్నారు. అదే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి గెలిస్తే నంద్యాల అభివృద్దికి బాబుపై ఒత్తిడి తేలేడ‌ని అందుకే శిల్పాను గెలిపించాల‌ని నిర్న‌యించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -