- Advertisement -
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోరాటానికి మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మద్దతు తెలుపుతూ లేఖను రాశారు. టీడీపీని నిమజ్జనం చేసే వరకు ఇంటి మొహం చూడవద్దని సలహా ఇచ్చారు. ‘మీ తల్లికి జరిగిన అవమానం తట్టుకోలేక దీక్షకు దిగారని తెలిసింది. మీ తల్లికి జరిగిన అవమానం నాకు బాధ కలిగించింది. చంద్రబాబులాంటి దుర్మార్గుడిని మీరు భుజాలపైకి ఎక్కించుకున్నారు. కాపులకు రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తే నా కుటుంబాన్ని అవమానించారు. బూతులు తిడుతూ కుటుంబసభ్యులను కొట్టారు. ఆఖరికి తుందూరు ఆక్వా పార్క్ గురించి చెప్పుకునేందుకు మీ వద్దకు వచ్చిన వారిపై కేసులు పెట్టారు.