Friday, March 29, 2024
- Advertisement -

ఆర్కే ఆవేదన…. వైకాపాలోకి ఇద్దరు టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు

- Advertisement -

తెరవెనుక ఎన్ని ప్రలోభాలు, ప్రయత్నాలు చేసినా టిడిపి నుంచి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైకాపాలో చేరడం ఖాయమైంది. గత కొన్ని రోజులుగా బాబు, లోకేష్‌లతో పాటు పచ్చ పార్టీ కోసం పాటుపడే మీడియా యజమానులు కూడా ఈ చేరికలను ఆపడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం టిడిపిలో ఉండడానికి ససేమిరా అన్నారు. ఇప్పుడిక టిడిపి భజన మీడియా జడలు విదుల్చుకుంది.

ముందుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విషప్రచారం మొదలెట్టారు. గుంటూరు జిల్లాలోని ఒక ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అలాగే మరో ఎమ్మెల్యేకు కూడా అస్సలు ప్రజాదరణ లేదని ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చింది. అన్నింటికీ మించి ఆ ఎమ్మెల్యేలను చెడు చేసే ప్రయత్నంలో చంద్రబాబు డబ్బు రాజకీయాల గురించి కూడా చెప్పేశాడు రాధాకృష్ణ. ఈ ఇద్దరు ఎమ్మల్యేలకు అస్సలు ప్రజాదరణ లేకపోయినప్పటీకి 2014 ఎన్నికల్లో చంద్రబాబే స్వయంగా భారీగా డబ్బులు ఖర్చు చేయించి గెలిపించాడట. ఆ కృతజ్ఙత కూడా లేకుండా ఇప్పుడు వీళ్ళు వైకాపాలోకి జంప్ చేస్తున్నారట. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను చంద్రబాబు డబ్బు ఖర్చు చేయించి గెలిపించాడని సర్టిఫై చేసిన చంద్రబాబు ఆంతరంగిక జర్నలిస్ట్ రాధాకృష్ణ………గెలిచిన ఇతర ఎమ్మెల్యేలందరూ కూడా ఇదే రకంగా డబ్బుతో గెలిచినవాళ్ళా? కాదా అన్నది కూడా చెప్పాలి అని విశ్లేషకులు అడుగుతున్నారు. డబ్బులు భారీగా ఖర్చు చేసి ఎమ్మెల్యేలను గెలిపించుకునే పార్టీ అధినేతను ఏమనాలో కూడా రాధాకృష్ణే చెప్పాలి అని నెటిజనులు అడుగుతున్నారు. సమాధానం చెప్తారంటారా? లేక చెప్పింది విను చరిత్ర అడక్కుటైపులోనే వ్యవహరిస్తారా? అయినా పచ్చ బ్యాచ్ డబ్బు రాజకీయాల గురించి కొత్తగా వివరణ అవసరమా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -