Tuesday, May 14, 2024
- Advertisement -

నంద్యాల ఉపఎన్నిక.. ఎన్నికోట్ల బెట్టింగ్ అంటే..?

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నికలు.. ఏపీలో చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికలపై భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నాయి. మరి ప్రధానంగా రాయలీసీమలో.. ఈ ఎన్నికపై రాజధాని ప్రాంతం విజయవాడలో తీవ్రమైన ఆసక్తి ఏర్పడింది. ఈ ఎన్నికపై రాజకీయ నేతలంతా బెట్టింగులు కాస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ బలాలేంటి? వైసీసీ బలహీనతలేంటి? అనే అంశాలపై అందరూ చర్చ జరుపుకుంటున్నారు.

ఏకంఆ రాష్ట్రంలో వెయ్యి కోట్ల మేర బెట్టింగులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నంద్యాల ఎన్నిక మొత్తం.. కులాల వారీగా లెక్కలు తేల్చాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. దీంతో కుల సమీకరణల ఆధారంగా బెట్టింగ్ రాయుళ్లు పందాలు కాస్తున్నారు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే ఈ బెట్టింగులు ఏపీని దాటి హైదరాబాద్కు కూడా పాకేశాయి. అయితే ఎక్కువగా బెట్టింగ్లకు కేరాఫ్ అడ్రస్ అయిన గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ గుంటూరు జిల్లాలో ఈ ఫీవర్ ఎక్కువగా కనిపిస్తోంది. రాజకీయ నేతలు ఈ పందాలలో ఎక్కువగా కనపడుతున్నాయి. ఎవరి స్థోమతను బట్టి వారు బెట్టింగ్ వేస్తున్నారు.

లక్ష నుంచి కోటి రూపాయల వరకు ఈ బెట్టింగ్లు జరుగుతున్నాయి. టీడీపీ నేతలు కూడా నంద్యాల బై పోల్ పై బాగా బెట్టింగులు కాస్తున్నారు. విజయవాడలో పేరు మోసిన ఓ టీడీపీ లీడర్ భారీగానే బెట్టింగ్లు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక విజయవాడలోనే 100 కోట్ల బెట్టింగ్లు దాటినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ బెట్టింగ్లు 1000 కోట్లు దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -