Saturday, May 18, 2024
- Advertisement -

వైఎస్సార్​ బిడ్డగా… మీ నిర్ణయం నాకు అవసరం: షర్మిల

- Advertisement -

తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించడమే తన లక్ష్యమని వైఎస్​ షర్మిల పునరుద్ఘాటించారు. వైఎస్సార్​ కులమతాలకతీతంగా పాలించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. లోటస్‌పాండ్‌లో రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న షర్మిల… జై తెలంగాణ… జోహార్ వైఎస్సార్ అంటూ నినదించారు. పేదలు, రైతులు, విద్యార్థులకు ఉపయోగపడేలా వైఎస్సార్​ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చారని… ప్రజల ఆశీర్వాదంతో నాటి స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందామన్నారు.

వైఎస్సార్​ ప్రేమించిన విధంగానే తెలంగాణ ప్రజలు కూడా ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారని షర్మిల పునరుద్ఘాటించారు. అందుకే మహానేత మరణించినప్పుడు ప్రాణాలొదిలేసిన వాళ్లలో తెలంగాణ వాళ్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైఎస్ అభిమానుల నుంచి పలు అంశాలపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

దీనికి సంబంధించిన కొన్ని పేపర్లను ఇచ్చి సమాధానాలను కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైఎస్సార్​ బిడ్డగా… రాజకీయ నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు.. రాష్ట్రంలో వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు… జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఉన్న అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

నోటి నుంచి దుర్వాసన వస్తుందా? అయితే ఇలా పోగొట్టుకోండి..

ఈ రుచి మాములుగా ఉండ‌దు.. క్యూ క‌ట్టాల్సిందే!

విజయసాయిరెడ్డి పాదయాత్ర.. రూట్ ఫిక్స్.. బహిరంగ సభ ఫిక్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -