Saturday, May 11, 2024
- Advertisement -

గెలుపుపై ఇంట‌లిజెన్సీ తాజా రిపోర్ట్‌

- Advertisement -

కొంత‌కాలంగా దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్శించిన నంద్యాల ఉప ఎన్నిక ముగిసింది. రెండు పార్టీలు డు ఆర్ డై అన్న‌ట్లు ప్ర‌చారం చేశాయి. ఇప్పుడు ఫ‌లితం ఎలాఉంటుంద‌నె దానిపై స‌ర్వ‌త్రా అంద‌రిలోను ఉత్కంఠ‌కు తెర‌లేపింది. ఇది ఏపీ రాజ‌కీయాల‌ను ద‌శ‌,దిశ మార్చె ఎన్నిక‌. ఉప ఎన్నిక‌లో ఇంత భారీ పోలింగ్ జ‌ర‌గ‌డం ఎప్పుడూ లేక‌పోవ‌డంతో అంద‌రిలో టెన్స‌న్ మొద‌ల‌య్యింది.

గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఓట్ల శాతం అధికార పార్టీకి ఇబ్బంది అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ రోడ్ షో ఆ పార్టీకి వ‌ల‌సి వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త దానికి సంకేతంగా రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

గ‌త కొంత‌కాలంగా అనేక స‌ర్వేలు వైసీపీ అభ్య‌ర్తి శిల్పాదే విజ‌యం అనే స్ప‌ష్టం చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా ఇంట‌లిజెన్స్ రిపోర్ట్ సంచ‌ల‌నంగా మారింది. రిపోర్ట్‌లో వైసీపీదే విజ‌యం ఖాయ‌మ‌నె వార్త‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. మెజార్టి ముస్లిం ఓట్లు వైసీపీ వైపె మొగ్గు చూపిన‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -