Thursday, May 16, 2024
- Advertisement -

పాద‌యాత్ర ఎఫెక్ట్ : టీడీపీ నుంచి మ‌రో బిగ్ వికెట్ వైసీపీలోకి…

- Advertisement -

జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ఎఫెక్ట్ టీడీపీపై ప్ర‌భావం చూపుతోంది. పాదయాత్ర మొదలైన దగ్గర నుండి వివిధ జిల్లాల్లోని టిడిపి నేతలు అక్కడక్కడ జగన్ ను కలుస్తు పార్టీలో చేరుతున్నారు. రాయ‌ల‌సీమ‌లో చేస్తున్న పాద‌యాత్ర‌లో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిక‌లు జ‌రిగాయి. త్వరలో కడప జిల్లాలో టిడిపి నుండి మరో పెద్ద నేత వైసిపిలో చేరబోతున్నట్లు ప్రచారం మొదలైంది.

వైఎస్ఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు రాజంపేట మాజీ ఎంపీ సాయిప్ర‌తాప్‌ త్వ‌ర‌లో వైసీపీ ఖండువా క‌ప్పుకోనున్నార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. అందుకు రంగం సిద్ధం అయిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా సాయి ప్ర‌తాప్ జ‌గ‌న్‌ను పొగ‌డ‌టం చూస్తే వార్త‌ల‌కు బ‌లాన్ని చేకూరుస్తున్నాయి.

నిత్యం జనాల్లో ఉండేందుకే జగన్ భారీ ప్రణాళికలు రూంపొందించుకుంటున్నట్లు చెప్పారు. ఇపుడు చేస్తున్న పాదయాత్ర కూడా అందులో భాగమేనట. టిడిపిలో ఉంటూ జగన్ ను ప్రశంసించటమంటే ఏమిటి అర్ధం? అంటూ జిల్లా టిడిపి నేతలు ఆరాలు తీస్తున్నారు. ఇదే విషయాన్ని దావోస్ నుండి చంద్రబాబునాయుడు తిరిగి రాగానే ఫిర్యాదు చేయాలని కూడా అనుకుంటున్నారట.

కొన్ని కార‌నాల వ‌ల్ల జ‌గ‌న్‌తో విబేధించి సాయిప్ర‌తాప్ టీడీపీలో చేరారు. అయితే పార్టీలో ఆయ‌న ఇమ‌డ‌లేక‌పోతున్నారంట. కాబట్టి వైసిపిలో చేరి మళ్ళీ ఎంపిగా పోటీ చేయాలన్నది సాయి ఆలోచన కావచ్చని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే మరి సిట్టింగ్ ఎంపి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పరిస్ధితేంటి? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాశంగా మారింది. ఒక వేల సాయిప్ర‌తాప్ వైసీపీలో చేరితే జ‌గ‌న్ ఎలా స‌ర్దుబాటు చేస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -