2019 ఎన్నికలు రవసవత్తరంగా జరగనుందనడంలో సందేహంలేదు. ప్రధానంగా ఎన్నికలు పొత్తులపైనే ఆధారపడింది. ప్రధాన పార్టీలు పవన్ మద్దతు ఎవరికి ఇస్తారనే సస్పెన్స్కు తెరదించారు పవన్. మద్దతు పలానా పార్టీకి అని చెప్పకుండా రైతులకు ఎవరు అండగా నిలబడతారో వారకి ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను రాబోయే ఎన్నికల్లో ఎవరికి మద్దతు పలుకుతానన్న ప్రశ్న అందిరిలోనూ ఉందని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరైతే రైతులకు అండగా ఉంటారో వారికి తాను మద్దతిస్తానని స్పష్టతనిచ్చారు. అనంతపురం రైతాంగ కన్నీరుని ఎవరు తుడుస్తారో వారికి తాను అండగా ఉంటానని చెప్పుకొచ్చారు.
ఏ పార్టీకయినా మద్దతిచ్చే ముందు అనంతపురానికి అండగా ఎలా నిలబడతారని అడుగుతానని పవన్ కల్యాన్ అన్నారు. రైతులకి జనసేన పార్టీ అండగా ఉంటుందని, అనంతపురం నుంచి తనకు మద్దతు కావాలని కోరారు. ఎన్నికల ముందు రాజకీయ నాయకులు వచ్చి ఓటేయమని అడుగుతారని, అనంతపురానికి ఏం చేశారని నిలదీయాలని చెప్పారు.
అలాగే అనంతపురం ప్రజలు ఇష్టమైతేనే జనసేన పార్టీకి ఓటు వేయాలని, లేదంటే తనను ఓడించాలని అన్నారు. 2019 ఎన్నికల్లో అనంతపురం నడుంబిగించకపోతే ఎప్పటికీ ఈ ప్రాంతం సమస్యలు పోవని అన్నారు.