జనసేన అధినేత పవన్పై కత్తిమహేష్ మరో్ సారి కత్తిదూశారు. ఈసారి ఆయనపై ట్విట్టర్లో ఘాటైన ట్వీట్లు చేశారు. దీంతో మరోసారి పవన్ అభిమానులు, కత్తిమధ్య మాటల యుద్ధం తారాయికి చేరొ్వొ. గతంలో పవన్ అభిమానులు, కత్తిమధ్య ఎలాంటి మాటల యుద్ధం కొనసాగిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో సారి పవన్పై ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసి మరో సారి అగ్గిరాజేశాడు.
ఎన్నికల్లో మాత్రం టీడీపీ-బీజేపీకి నువ్వు సపోర్టు. ఇప్పుడు మాత్రం నీకు కాంగ్రెస్, వామపక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ సపోర్టు కావాలి. ఏమయ్యా పవన్ కల్యాణ్.. అంతేనా’ అంటూ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ట్విట్టర్ వేదికగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా ఏపీ ప్రత్యేక హోదాపై తన గళం వినిపిస్తున్న మహేష్ కత్తి.. పవన్ కళ్యాణ్ను టార్గెట్గా చేస్తున్న ట్వీట్స్ వేడిరాజేస్తున్నాయి.
తెలుగుదేశం తెలుగు ప్రజల్ని మోసం చేసింది. బీజేపీ తెలుగుదేశాన్ని తెలుగు ప్రజల్ని మోసం చేసింది. ఈమోసాన్ని ప్రశ్నించకుండా పాచిపోయిన లడ్డూల్ని పరీక్షించడానికా నిజనిర్ధారన కమిటీని ప్రశ్నించారు.ప్రత్యేకహోదాపై నీ నిబద్ధత ఎక్కడ? JAC బదులు JFFC ఎందుకొచ్చింది?ఎన్ని మాటలు మారుస్తావు? ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎలా ఏమారుస్తావు? అంటూ వరుస ట్వీట్స్ చేస్తున్న మహేష్ కత్తి తాజాగా చిరంజీవి ఫ్యామిలీ కాపు జాతికి చేసిందేమీ లేదన్నారు.
నాయుడు. రాయల్. కాపు. పిల్లల్లారా…పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా నమ్మే ముందు. చిరంజీవి కాపు కులానికి చేసిన మోసం గురించి మీ తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకొండి. సినిమా పరిశ్రమలోను. రాజకీయాల్లోనూ కాపులకి చిరంజీవి ఫ్యామిలీ చేసింది ఏమీ లేదు. ముద్రగడ పద్మనాభం అసలైన లీడర్. వీళ్లు కాదు. అంటూ వివాదాస్పద కామెంట్స్ చేసిన మహేష్ కత్తి ఆ వేడి చల్లారక ముందే పవన్ కళ్యాణ్ ‘జేఎఫ్సీ’పై విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు.
అయితే మహేష్ కత్తి ట్వీట్లకు అదే రీతిలో కౌంటర్స్ ఇస్తున్నారు జనసేన అభిమానులు. ట్విట్టర్లో పవన్ ఫ్యాన్స్ , మహేష్ కత్తిల మధ్య వార్ తారాస్థాయి చేరుకుని వ్యక్తిగత దూషణలకు దారితీసింది. మరి ఈ ట్వీట్స్ వార్కు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి.
పవన్ కళ్యాణ్ ఇచ్చిన గడువు దాటింది. గవర్నమెంట్లు "తూచ్!" అన్నాయి. ఏమీ పీకలేవ్ పో అన్నాయ్. ఇక తదుపరి కార్యక్రమం ఏమిటి పవన్ (కాలయాపనా)కళ్యాణ్ ?
— Kathi Mahesh™️ (@kathimahesh) February 15, 2018