కత్తి మహేష్ తన రూటును మార్చుకున్నాడు. జనసేన అధినేత పవన్ను ఏకిపారేసిన కత్తి గురి ఇప్పుడు ఏపీప్రభుత్వం వైపు మళ్లింది. ముఖ్యంగా సీఐఐ పెట్టుబడుల సదస్సును, కమ్మ కులానికి ముడిపెట్టి కత్తి మహేష్ చేసిన ట్వీట్లు దుమారం రేపుతున్నాయి.
ఎంవోయూకి అగ్రిమెంట్ కు చాలా తేడా ఉందన్న కత్తిమహేష్, ఎందుకింకా ప్రజల్ని మోసం చేస్తున్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఇప్పటివరకు వందల ఎంవోయూలు చేసుకున్నారని, వాటి అప్ డేట్స్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
అంతటితో ఊరుకుండకుండా కులాన్ని టార్గెట్ చేశారు. “కమ్మోళ్లకు తప్ప మరోకులం వాళ్లకు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఎందుకు కనిపించడం లేదు చెప్మా” అంటూ ఓ సెటైర్ కూడా వేశాడు. ఇదే ఇప్పుడు దుమారం లేపుతోంది. ఒక మాత్రమే చంద్రబాబు సర్కార్ ను వెనకేసుకొస్తోందని, అభివృద్ధి లేకపోయినా జరిగినట్టు ప్రచారం చేస్తోందని కత్తి మహేష్ అభిప్రాయం.
అప్పులు సంపాదించగలగటమే అభివృద్ధికి మెగా ఇండికేటర్ అని చంద్రబాబు చెప్పడం. మనంనమ్మడం. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు. మన భవిష్యత్తు లోకేష్ పాలు. ఇదే కమ్మోళ్లకు, తెలుగుదేశం పార్టీకి కావలసింది.” అంటూ మరో ట్వీట్ కూడా చేశాడు కత్తి మహేష్. కత్తి చేసిన ట్వీట్లకు సోషియల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. ఇది ఎంత వరకు వెల్తుందో చూడాలి.
Partnership Summit పేరుతో,విదేశీ పెట్టుబడుల పేరుతో వందల కోట్లు ప్రభుత్వ ధనం ఖర్చు చెయ్యడం. లక్షల కోట్ల MoU లు సంతకం చేశామని ప్రగల్భాలు పలకడం. వందల కోట్ల ప్రాజెక్టులు మాత్రమే నిజమౌతాయి. లక్షల కోట్ల అప్పులు మాత్రమే మిగులుతుంది. సొమ్ము ప్రజలది. సోకు చంద్రబాబుది. అప్పు ప్రభుత్వానిది.
— Kathi Mahesh (@kathimahesh) February 26, 2018
అప్పులు సంపాదించగలగటమే అభివృద్ధికి మెగా ఇండికేటర్ అని చంద్రబాబు చెప్పడం. మనం నమ్మడం. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు. మనభవిష్యత్తు లోకేష్ పాలు. ఇదే కమ్మోళ్లకు, తెలుగుదేశం పార్టీకి కావలసింది.
— Kathi Mahesh (@kathimahesh) February 25, 2018
కమ్మోళ్లకు తప్ప మరే కులపొళ్ళకూ చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఎందుకు కనపడదు చెప్మా!
— Kathi Mahesh (@kathimahesh) February 25, 2018