అసెంబ్లీ రద్దు అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పార్టీ తరుపున 119 సీట్లకు గాను 105 సీట్లకు అభ్యర్తులను ప్రకటించి రాజీకీయ పార్టీలకు షాక్ ఇచ్చారు. దాదాపు సిట్టింగ్ నేతలకే టికెట్లు కేటాయించిన కేసీఆర్ బాబూమోహన్కు మాత్రం షాక్ ఇచ్చారు.
పెండింగ్ పెట్టిన సీట్లలో ప్రముఖంగా మెదక్ జిల్లా ఆందోళ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూ మోహన్కు షాక్ ఇస్తూ జర్నలిస్ట్ క్రాంతికి టికెట్ కేటాయించారు. దాంతో పాటు చెన్నూరు సిట్టింగ్ నల్లాల ఓదేలుకు కూడా టికెట్లు నిరాకరిస్తున్నట్టు ఆయన తెలిపారు.
పలు సందర్భాల్లో అధికారుల పట్ల, ప్రజల పట్ల బాబూమోహన్ అభ్యంతరకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ప్రగతి నివేదన సభ సందర్భంగా కూడా ఏకంగా టీఆర్ఎస్ కార్యకర్తలపైనే ఆయన కాలెత్తారు. బాబూమోహన్ కు కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడానికి ఇదే కారణం కావచ్చని సమాచారం.