తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు ఎన్నికల నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్కు ముందు తన ఇష్ట దైవం కోనాయిపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా ఆయన ఈ ఆలయాన్ని సందర్శించుకున్నారు. కోనాయిపల్లికి వచ్చిన కేసీఆర్ కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.
తన నామినేషన్ పత్రాలతో ఉదయం 11:50 నిమిషాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1985 నుండి కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం కేసీఆర్ సంప్రదాయం. ఎక్కడి నుండి పోటీ చేసినా కూడ కేసీఆర్ ఈ ఆలయంలోనే తన నామినేషన్ పత్రాలను వెంకన్న వద్ద ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించనున్నారు.
కోనాయిపల్లికి వచ్చిన కేసీఆర్ కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.