తెలంగాణాలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రంజుగా మారాయి. టికెట్లు ఆశించి బంగపడ్డవారు ఇతర పార్టీల్లోకి జంపింగ్ చేస్తున్నారు. ఇక అధికార పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. మొన్న కాంగ్రెస్ మాజీ స్పీకర్ సురేష్రెడ్డి టీఆర్ఎస్ ఖండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో సీనియర్ ప్రముఖ నటి ఆపార్టీలో చేరుతున్నట్లు సమాచారం.
సహజన నటిగా పేరు తెచ్చుకున్న జయసుధ గులాబీ పార్టీలో చేరుతున్నారనే వార్తలు బలంటా వినిపిస్తున్నాయి. ఆమెను టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా పార్టీ అధినేతలే స్వయంగా ఆహ్వానించారు.రాష్ట్ర మంత్రి కె తారకరామారావు ఇటీవల ఆమెకు స్వయంగా ఫోన్ చేసి తమ పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు సమాచారం.
కేటీఆర్ ఆహ్వానంపై ఆలోచించి చెబుతానని జయసుధ చెప్పారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న జయసుధ, క్రియాశీలక రాజకీయాలకు గత కొంత కాలంగా దూరంగా ఉన్నారు. గతంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత రాజకీ యాలకు దూరమయ్యారు. ఎమ్మెల్యేగా ప్రజల్లో మంచిపేరు సంపాదించారు.
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమెను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటే పార్టీకి కొంత ప్రయోజనం కలుగుతుందనే ఆలోచనతో టీఆర్ఎస్ లో చేరాలని కేటీఆర్ ఆహ్వానించినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. మరి గులాబీ ఖండువా కప్పుకుంటారా లేదా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.