- Advertisement -
కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. కోడమూరు నియోజక వర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. సుమారు రెండువేల మంది అనుచరులతో ఆయన పార్టీలో చేరారు.వైఎస్ జగన్ ఈ సందర్భంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీలతో పాటు, ఏడుగురు ఎంపీటీసీలు, పలువురు సర్పంచ్లు కూడా వైఎస్సార్ సీపీలో చేరారు.