Sunday, April 28, 2024
- Advertisement -

ఏపీ మంత్రులకు తెలంగాణ మంత్రి హరీష్ రావు కౌంటర్

- Advertisement -

ఏపీ మంత్రి కారుమూరి కామెంట్లపై మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుంది. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది. బోరు బావుల వద్ద 24 గంటల కరెంటు ఉంది. కెసిఆర్ కిట్ ఉంది. కళ్యాణ లక్ష్మి ఉంది. ఎకరానికి పదివేలు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా ఉంది. ప్రత్యేక హోదా కేంద్రం ఎగబెట్టిన ఎం అడగరు అంటు కౌంటర్ ఇచ్చారు.

అంతే కాదు ఏపీ లో ఏముంది… కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవరూ మాట్లాడటం లేదు. విశాఖ ఉక్కు ను తుక్కు కింద పెట్టినా మాట్లాడని పరిస్థితి ఉంది. అధికార పార్టీ అడగదు ప్రతి పక్షం ప్రశ్నించదు. రెండు పార్టీలు జనాన్ని గాలికి వదిలేసి స్వార్థం కోసం పని చేస్తున్నాయి. అనవసరంగా మా జోలికి రాకండి, మా గురించి ఎక్కువ మాట్లాడకండి అది మీకే మంచిది అంటు సలహా ఇచ్చారు తెలంగాణ మంత్రి హరీష్ రావు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -