Tuesday, May 14, 2024
- Advertisement -

చంద్రబాబును కడిగేసిన టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి..

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణా టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి మరో సారి నిప్పులు చెరిగారు. పసుపు-కుంకుమ గురించి మాట్లాడే ఆర్హత లేదన్నారు. పరిటాల సునీత, వంగవీటి రత్నకుమారిల పసుపూ, కుంకుమ తుడిచింది నువ్వు కాదా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ప్రజలనుంచి దోచుకున్న సొమ్ముతో ఓట్లు కొనాలని చూస్తున్నారని … బాబును ఎవరూ నమ్మవద్దని మోత్కుపల్లి సూచించారు. వైఎస్ జగన్ ను సీఎం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వెన్నుపోటు, అక్రమాలకు మారుపేరు చంద్రబాబు అని మండిపడ్డారు. పార్టీలో అందరూ వద్దన్నా కేవలం అల్లుడనే కారణంగా ఎన్టీఆర్ చంద్రబాబుని పార్టీలోకి తీసుకున్నారని తెలిపారు. అలాంటి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ప్రాణాలు తీసిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు.
అవినీతితో లక్షల కోట్లు సంపాదించిన చంద్రబాబు ఈ రోజు నీ కోసం, నీ కొడుకు కోసం మాత్రమే బతుకుతున్నావ్ తప్ప ప్రజల కోసం ఏమీ చేయడం లేదని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ మీద 31 కేసులు ఉన్నాయని చెప్తున్న చంద్రబాబు నీ మీద 29 కేసులున్న సంగతి మర్చిపోకని హితవు పలికారు. ఎన్టీఆర్ టీడీపీ జెండాను దొంగిలించిన చంద్రబాబు ఓ దొంగ ఐతే..తాను పెట్టిన పార్టీకి ఏకైక మొనగాడు వైఎస్‌ జగన్ అని వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -