Friday, March 29, 2024
- Advertisement -

చంద్రబాబు పై విజయసాయి సంచలన ట్విట్!

- Advertisement -

ఏపిలో గత కొంత కాలంగా రాజకీయాలు హీట్ ఎక్కుతున్న విషయం తెలిసిందే. దానికి తోడు వరుసగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీ వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. దాంతో ప్రతిపక్ష పార్టీల అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు. ఈ సందర్బంగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి సంచలన ట్విట్ చేశారు.

ఏపీలో ఆఫీసులు మూసెయ్యడంతో పక్క రాష్ట్రంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న 420కి జన్మదిన శుభాకాంక్షలు. పైగా కరోనా వల్ల బర్త్ డే ఘనంగా చెయ్యవద్దంటూ సందేశం. 17 తర్వాత ‘పార్టీ లేదు బొక్కాలేదన్న సందేశాన్ని’ ఇప్పటికే మీవాళ్లు పాటిస్తున్నారులే బాబు. మళ్ళీ నీ ‘బ్రీఫ్ డు అవసరం లేదు.

సింహాచలం దేవస్థానం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఎక్కువ మందిని గంటా సతీమణి చౌదరి మేడం నియమించారట! చంద్రబాబూ నీ పార్టీ దిగజారడానికి ఇక మెట్లు లేవు. 2 ఛానళ్లు, 2 పేపర్లలో చూసుకుని మురిసిపోవడమే. రాష్ట్రంలో ఇంకా పచ్చ పార్టీ ఉందనే భ్రమ కల్పించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా బాబూ? అంటూ సంచలన ట్విట్ చేశారు విజయసాయిరెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -