కాపు సామజికవర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ నెల 14న వైఎస్ఆర్ సిపిలో చేరుతున్నాను అని తెలిపిన ముద్రగడ…నా కుమారుడితో పాటు నేను సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతామన్నారు. తాను ఏలాంటి పదవులు ఆశించడం లేదని ఈ సందర్భంగా తెలిపారు.
భగవంతుడు దయవల్ల మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి గా గెలిస్తే ఆయన ఏ పదవి ఇచ్చినా తీసుకునేందుకు సుముఖంగా ఉన్నాను అని చెప్పారు. వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గోంటానని వెల్లడించారు.
అయితే ఈ సారి ఎన్నికల్లో ముద్రగడ పోటీ చేస్తారా లేదా ఆయన తనయుడిని రంగంలోకి దించుతారా అన్నది తెలియాల్సి ఉంది. అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ముద్రగడ కుమారుడు గిరి పేరు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ కూడా వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే.