జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం తనను, తన కుమార్తె ఇల్తీజాను మరోసారి గృహ నిర్బంధం చేసిందని ఆరోపించారు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. పుల్వామాలోని వహీద్ పర్రా కుటుంబాన్ని కలిసేందుకు.. రెండురోజులుగా తమకు అనుమతినివ్వడం లేదని అన్నారు. వహీద్ పర్రాను నిరాధార ఆరోపణలతో ఎన్ఐఏ అరెస్టు చేసిందని ఆమె వ్యాఖ్యానించారు.
వహీద్ పర్రా పీడీపీ నేత. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ముఫ్తీ విజయానికి సహకరించాలని హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థతో చర్చలు జరపారన్న ఆరోపణలపై పర్రాను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
ముఫ్తీ నిర్బంధంపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం తమ అధీనంలో ఉంచుకుంటోందని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థ జోక్యం ఏ మాత్రం లేకుండా తమ ఇష్టానుసారం ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
టీకా తీసుకునే ముందు జాగ్రత్త..!