Tuesday, May 7, 2024
- Advertisement -

హ‌త్యాకుట్ర‌ను భ‌గ్నం చేసిన పోలీసులు..

- Advertisement -

అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ అప్పుడప్పుడు ఇంకా బుసలు కొడుతూనే ఉంది. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు అప్పుడప్పుడు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా వైసిపి నేతపై హత్య పథకం వెలుగులోకి వచ్చింది. వైసీపీ నేతను హ‌త్య‌చేయ‌డానికి కుట్ర‌ప‌న్నిన ముఠాను సకాలంలో పోలీసులు స్పందించి కుట్ర‌ను భ‌గ్నం చేశారు.

జిల్లాలోని బిసి నేత ధనుంజయ్ యాదవ్ హత్యకు టిడిపికి చెందిన ఓ పెద్ద నేత స్కెచ్ వేసినట్లు వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు పదిమందిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేక తమ నేతల హత్యలకు టిడిపి కుట్రలు పన్నుతోందని వైసిపి నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 10 మంది కిరాయిహంతక ముఠాగా త్రి టౌన్ పోలీసులు గుర్తించారు.

ధనుంజయ్ యాదవ్ వైసీపీ తరపున మంత్రి పరిటాల సునీత నియోజకవర్గమైన రాప్తాడులో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. యాదవ్ కు గ్రామీణ ప్రాంతాల్లో బాగా పట్టున్న నేతగా వైసిపి నేతలు చెబుతున్నారు. యాదవ్ హత్యకు టిడిపి నేత రూ. 30 లక్షలకు కిరాయికి మాట్లాడుకున్నారట. వైసిపి నేత అడ్డు తొలగించుకునేందుకు మంత్రే హత్యకు కుట్ర పన్నినట్లు తోపుదుర్తి ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఫిర్యాదు చేయటానికి వైసిపి నేతలు జిల్లా ఎస్పీని కలవటానికి ప్రయత్నిస్తున్నారు.

రాప్తాడు నియోజకవర్గంలో కీలకమైన వైసీపీ నేతలను హత్యలు చేయడం ద్వారా భయాందోళన సృష్టించి.. ఏకచక్రాధిపత్యం చెలాయించేందుకు పరిటాల కుటుంబం ప్రయత్నిస్తోందని చెప్పారు. మొత్తం మీద ధనుంజయ్‌ యాదవ్ హత్య కుట్ర భగ్నం కావడంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -