- Advertisement -
ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం వాడీవేడిగా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ తీరును, 15వ ఆర్థిక సంఘం విధివిధానాలపై పలువురు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ చర్చించారు. ఈ సందర్భంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనే మీడియా కళ్లు ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ పార్టీ ఎన్డిఎ నుండి బయటికి వచ్చిన తరువాత ప్రధాని మోదీని మొదటిసారి కలవబోతున్నారు.దీంతో మీడియా ఫోకస్ మొత్తం వీరిద్దరిపైనే ఉంది.
సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ తన సీటులో కూర్చున్నారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు మోదీతో షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ సమయంలో మోదీ చంద్రబాబును పెద్దగా పట్టించుకోలేదు. మోదీ చంద్రబాబును పట్టించుకోకుండానే వెళ్లి, తన సీటులో ఆశీనులయ్యారు.