Sunday, April 28, 2024
- Advertisement -

బాలకృష్ణను చెడుగుడు ఆడేసిన అనీల్

- Advertisement -

బాలయ్యబాబు గతంలో చాలా విషయాల్లో పద్దతిగానే ఉండేవాడు.కాని బావ విషయంలోకి వచ్చేసరికి బావ కళ్లలో ఆనందం చూడటం కోసం రాంగ్ ట్రాక్ లోకి వచ్చినట్లు స్పష్టమవుతుంది. అందుకే విషయం తెలియకుండానే డైలాగ్ లు చెప్పేస్తున్నాడు. ప్యారడైజ్ పేపర్స్ టాపిక్ పై బాలయ్య ..జగన్ ను ఏదో నోటికొచ్చినట్లు కామెంట్లు చేసేసాడు. ఈవిషయంలో బాలయ్యకు సరైన అవగాహన లేకుండానే ఏదో అనేశాడనుకుంటే… ఆ మాటలు జగన్ అభిమానులనే కాదు… వైసీపీ శ్రేణులకు ఒళ్లు మండేలా చేశాయి. ఎన్నో తప్పులు చేస్తే అయ్యోపాపం అన్నగారబ్బాయని చాలా సందర్భాలలో జగన్ బాలయ్యను వదిలేశాడు.ఇది అందరికీ తెలిసిన నిజమే.కాని ఇపుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు.

అందుకే బాలయ్యపై టైమ్ చూసి పడిపోయాడు… నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్ ఎల్ ఏ అనీల్ కుమార్ . ఈయన బాలయ్యపై సీరియస్ కామెంట్లు చేశారు. పిచ్చి ఉందనే సర్టిఫికెట్ తో ఓ కేసు నుంచి బాలకృష్ణ బయటపడ్డాడన్నారు. ”ఏదైనా మీటింగ్ కు వెళితే మీరు ఎవరినీ కొట్టకపోతే వింత” అంటూ బాలకృష్ణపై విమర్శలు గుప్పించారు. అంతకుముందు.. ప్యారడైజ్ పేపర్స్ అంశంపై స్పందిస్తూ వైసీపీ అధినేత జగన్ మీద బాలకృష్ణ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణపై అనిల్ కుమార్ యాదవ్ ప్రతివిమర్శలు చేశారు. ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘’బాలకృష్ణ గారూ! మీరు కూడా మాట్లాడటం మొదలు పెడుతున్నారు! పిచ్చి ఉంది, మతిస్థిమితం లేదు..మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పి ముంబైలోని ఓ ఆసుపత్రి నుంచి సర్టిఫికెట్ తీసుకుని ఒక కేసు నుంచి నువ్వు తప్పించుకున్నావు.

మీ తండ్రిని వెన్నుపోటు పొడిచిన మీ బావ వెంట పారిపోయిన నువ్వు..జగన్మోహన్ రెడ్డిగారిని విమర్శించడం సిగ్గుచేటు” అంటూ విమర్శించారు. ఒక మహనీయుడికి ఎలాంటి కొడుకులు పుట్టకూడదనే దానికి నిదర్శనం మీరు అయితే, పులి కడుపున పులే పుడతాడని చెప్పడానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, బాలకృష్ణ ఏదైనా మీటింగ్ కు వెళితే ఎవరినీ కొట్టకపోతే వింత.. అటువంటి నువ్వు ప్రజల గురించి మాట్లాడటం, జగన్ ని విమర్శించడం సిగ్గుచేటని అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -