చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ తమ అనుకూల మీడియా ద్వారా వాళ్లు చెప్పేవే నిజాలని, వాళ్లు ప్రవచించేవే సుభాషితాలని ఇన్నాల్లు ప్రజలను మభ్యపెట్టిన సంగతి తెలిసిందే. కాని ఇప్పుడు మాత్రం వాల్లు చేసె అసత్య ప్రచారాలను నమ్మేదానికి సిద్దంగా ఎవరూ లేరు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయింది. లోకేస్ చేసే ట్వీట్లకు వెంటనే కౌంటర్లు పడుతున్నాయి. తాజాగా మరో సారి మోదీ రాక సందర్భంగా జగన్పై చేసిన ట్వీట్తో మరో సారి నెటజన్లకు అడ్డంకా బుక్ అయ్యాడు. దీంతో నెటజన్లు చినబాబును చెడుగుడు ఆడుకుంటున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అనుకూల జనాల మాటలకు ట్విట్టర్ తదితర సోషల్ మీడియాలో బలంగా కౌంటర్లు పడ్డాయి. ప్రత్యేక హోదా కోసం తాము ఇంత చేస్తుంటే ప్రతిపక్షనేత ఎక్కడ పడుకున్నారంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు చినబాబు. అయితే చినబాబు గారి ఈ తరహా పోస్ట్లపై ప్రజలు సోషల్ మీడియా ద్వారా దిమ్మతిరిగే సమాధానం ఇస్తున్నారు.
గతంలో ప్రత్యేక హోదా విషయంలో లోకేష్ మాట్లాడిన మాటలు మరచిపోయారేమోగాని…ఇప్పుడు జగన్పై ట్వీట్లు చేసి అభాసుపాలయ్యారు లోకేష్.ఆయనపై ట్విట్టర్లో ఘాటు కౌంటర్లు పడుతున్నాయి. హోదా వస్తే ఆకాశం నుంచి అన్నీ ఊడిపడతాయి అనుకుంటున్నారు, ఇక ఏ పనీ చేయకుండా ఇంట్లో కూర్చోవచ్చు అనుకుంటన్నారు అంటూ గతంలో లోకేష్ చెప్పిన మాటల వీడియోలను సోషల్ మీడియాలో ఉంచారు.అలాగే శభాష్ మోడీ అంటూ చంద్రబాబు ప్రశంసలను, సోనియాపై చేసిన విమర్శలను మాజీ చీఫ్ సెక్రటరీ కృష్ణారావు ట్విట్టర్ లో వుంచారు. డిజిటల్ యుగం కావడంతోనూ, మోడీతో విడాకులు జరిగి ఇంకా ఎంతోకాలం కాకపోవడంతోనూ, బాబు అప్పట్లో చేసిన ప్రసంగాలు, ఇచ్చిన స్టేట్ మెంట్ లు అన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు బయటపెడుతూ ఎదురుదాడి చేస్తున్నారు.
మోదీ పర్యటనకు జనాలు లేకపోవడంతో ప్రతిపక్షపార్టీ తమ కార్యకర్తలను పంపిస్తోందని ఆటోలపై జగన్ స్కిక్కర్లున్న ఫొటోను ట్యాగ్ చేస్తూ చినబాబు గారు మరో ట్వీట్ చేశారు. దీనిపై కూడా నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘అయ్యో లోకేష్ సారూ.. మీకు ఇది కూడా తెలియదా? ఆటోలపై జగన్ స్టిక్కర్లు ఆ ప్రతిపక్ష నేతపై ఉన్న అభిమానంతో వేసుకున్నారంటూ బదులిస్తున్నారు. ఇప్పటికీ దేవాన్ష్ మోదీ తాత అని పిలుస్తున్నాడా.. సోనియా అమ్మమ్మ అంటున్నాడా?’ అని సెటైర్లేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.