ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రతిపక్ష పార్టీలోకిరాజకీయ వలసలు ఆగడంలేదు. ఒక వైపు అన్ని పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు వేస్తున్నా వైసీపీలో చేరుతున్న నాయకులు ఏమాత్రం తగ్గడంలేదు. ఎన్నికల ప్రాచరంలో దూసుకుపోతున్న బాబుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.
టీడీపీ నేత, పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.పి.గన్నవరం టికెట్ ను ఈసారి నెలపూడి స్టాలిన్ బాబుకు కేటాయించడంతో మనస్తాపం చెందిన నారాయణమూర్తి టీడీపీని వీడారు. పిఠాపురంలో జగన్ సమక్షంలో నారాయణమూర్తి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. పీఠాపురంలో జరిగే వైసీపీ సభలో భారీ సంఖ్యలో అనుచరులు, మద్దతుదారులతో ఆయన వైసీపీలో చేరతారని పేర్కొన్నాయి.
పులపర్తి అనుచరుల్లో కొంతమంది జనసేన పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్, ముఖ్యంగా ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి అనుచరులు జనసేనలోకి వెళ్లిపోయారు. అయితే నారాయన మాత్రం వైసీపీలో చరేందుకు నిర్ణయం తీసుకున్నారు.