Friday, May 3, 2024
- Advertisement -

కూతుళ్ళను వ్యభిచార కొంపలకు అమ్ముకుంటున్న రైతులు: పరిటాల

- Advertisement -

చంద్రబాబు పరిపాలనా వైఫల్యం ఏ స్థాయిలో ఉంది? పచ్చ మీడియా చూపిస్తున్న గ్రాఫిక్స్ అభివృద్ధి అబద్ధం అని అందరికీ తెలుసు. స్వయంగా టిడిపి నేతలు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటూ ఉంటారు. అయితే గ్రాఫిక్స్ అబద్ధాలే అయినా ఎంతో కొంత అభివృద్ధి అయితే జరుగుతోంది కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. అయితే అవన్నీ అబద్ధాలేనని స్వయంగా టిడిపిలో ప్రముఖ నాయకుడు పరిటాల కుటుంబం నుంచి వచ్చిన పరిటాల శ్రీరామ్ తేల్చేశాడు.

చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీపై రైతులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పేదేముంది? మరీ ముఖ్యంగా కరువు జిల్లా అయిన అనంతపురం రైతులు గుంపగుత్తగా టిడిపికి ఓట్లేశారు. అయితే చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం విషయంలోనే చేతులెత్తేశాడు. ఆ ప్రభావం ఇప్పుడు రైతులపై ఏ స్థాయిలో ఉందో స్వయంగా పరిటాల శ్రీరామ్ మాటల్లోనే అందరికీ అర్థమైపోతోంది. అనంతపురం రైతులు కూతుళ్ళను వ్యభిచార కొంపలకు అమ్ముకుంటున్నారని ………ఆ స్థాయి దుస్థితిలో ఉన్నారని పరిటాల శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. ముంబై వ్యభిచార గృహాలకు అనంతపురం రైతులు కూతుళ్ళను అమ్ముకుంటున్నారని చెప్పాడు. రైతుల ఆత్మహత్యలు, వలసలు యథేచ్చగా సాగుతున్నాయని అభిప్రాయపడ్డాడు.

చంద్రబాబు పాలనలో రైతుల దుస్థితి గురించి ఇంతకంటే ఎవరైనా గొప్పగా చెప్పగలరా? రైతుల అభివృద్ధి కోసం ఎంతో చేస్తున్నానని ఇప్పటికీ చంద్రబాబు చెప్పుకోగలరా? అఫ్కోర్స్……..చంద్రబాబు చెప్పగలడు. అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేసే గోబెల్స్‌కి సిసలైన వారసుడు కదా. కాకపోతే రైతుల దయనీయ స్థితి గురించి స్వయంగా టిడిపి నేతలే ఈ స్థాయిలో ఘాటు కామెంట్స్ చేస్తుంటే బాబు పాలనను మెచ్చి మరోసారి బాబును కుర్చీ ఎక్కించే సాహసం ఆంద్రప్రదేశ్ ప్రజలు చేయగలరా అన్నదే ప్రశ్న.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -