జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణపై ఫోకస్ పెట్టారా ? ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ పర్యటన తెలంగాణలోని జనసైనికుల్లో కొత్త ఉత్సాహం నింపుతోందా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో పార్టీని నిలబెట్టడంపై పవన్ కల్యాణ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్ ఢీకొట్టేందుకు జనసేన సిద్ధమవుతోంది.
తెలంగాణ పాలిటిక్స్పై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించారు. జనసేన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. ఈ పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగం ప్రజలను ఆకట్టుకునేలా సాగింది. కుటుంబ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తానని ప్రకటించారు. 20 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తుతో ముందుకెళుతున్న జనసేన.. మరి తెలంగాణలోనూ అదే పార్టీతో జత కడుతుందా ? లేక ఒంటరిగా బరిలో దిగుతుందా అన్నది తేలాల్సి ఉంది. తెలంగాణలో పవన్ కల్యాణ్ సత్తా చూపిస్తారా ? మరి ఏపీలో జనసేన పరిస్థితి ఏంటన్న దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది.
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్
గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
-Ramesh Reddy Chilakala