వైసీపీ అధినేత జగన్ పై జనసేన పార్టీ అధ్యక్షుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతున్నా.. చంద్రబాబుగారిని ఎదుర్కొనే శక్తి, దమ్మూ ధైర్యం లేక మీరు అసెంబ్లీ నుంచి పారిపోతున్నారని ఎద్దేవ చేశారు. నేను నీస్థనాంలో ఉంటే ప్రభుత్వాన్ని ఓ ఊపు ఊపేసెవాడినన్నారు.
ప్రతిపక్షనాయకుడికి ఉన్న శక్తిని వాడుకోలేక పోతున్నారని మాట్లాడుతుంటే నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ జీవితం తెరిచిన పుస్తకం. ఏదీ దాయడు. చాలా మంది జీవితాల్లో కనిపించని పేజీలు ఉంటాయి. నా జీవితం అలా కాదు.. దాపరికాలు లేవు.. తెరిచిన పుస్తకమే’ అని పవన్ అన్నారు. నా వద్ద ఎలాంటి సీక్రెట్స్ లేవన్నారు. మీ కంటే నేను చాలా బెట్టర్ అన్నారు
జగన్తో పాటు ముఖ్యమంత్రికి నేను చెబుతున్నానని, నేను పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడితే.. పవన్ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు, లోకేష్ అంటున్నారని, ప్రజా సమస్యల గురించి మాట్లాడితే తప్పుదోవ పట్టించినట్లాని విమర్శించారు.
చంద్రబాబు, లోకేష్, జగన్, గోకరాజు రంగరాజులకు సవాల్ విసిరారు పవన్. గోదావరి జిల్లాపై డిస్కషన్ పెట్టాలని, నేను ఒక్కడినే మాట్లాడుతానని, అటువైపు వారు నలుగురు ఉండవచ్చునని, ఇదే భీమవరంలో, ఇదే సెంటర్లో చర్చిద్దామని, నేను ప్రశ్నలు అడుగుతానని, వారు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన, టీడీపీలను నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.