Sunday, May 19, 2024
- Advertisement -

అఖిల ప్రియకు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..?

- Advertisement -

ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలను.. అధికార పార్టీ టీడీపీ.. అలానే ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నంద్యాలలో జగన్ 12రోజులు ఉంటానని చెప్పడంతో.. టీడీపీకి ఏం చేయలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నెపథ్యంలో గెలిచేందుకు టీడీపీ నానా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే 15మంది మంత్రులు.. 30మంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి చంద్రబాబు, చినబాబు లోకేష్ అందరూ నంద్యాలపై పని చేస్తున్న టీడీపీకి విజయంపై నమ్మకం రావడం లేదు.. దాంతో నంద్యాలలో ప్రచారం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వాడుకోవాలని టీడీపీ చాలా ప్రయత్నలు చేస్తోంది.

అఖిల ప్రియ కూడా ఇదే మాట అనేసిందట. పవన్ ను ఉపయోగించోవడం వల్ల నంద్యాలలో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తోందని చంద్రబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ నేతలు నంద్యాల్లో పవన్ కళ్యాణ్ తమ వ్యక్తేనని చెప్పుకుంటున్నారు. అఖిలప్రియ, కేఈ కూడా ఈమాటే అన్నారు. పోలింగ్ కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోపు పవన్ ను నంద్యాల్లో దింపి.. ప్రచారంచేయించాలని ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

అయితే పవన్ మాత్రం తాజాగా చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడినట్టు అనుమానం వచ్చినందుకే తనపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని.. గత ఎన్నికల్లో మీతరపున ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని మాట ఇచ్చా కదా మరి అవే నెరవేరలేదు.. ఇప్పుడు నేను ప్రచారానికి వెళ్తే ప్రజల చేత తిట్లు తప్పవు అని చెప్పారట. అయితే పవన్ సన్నిహితులు కూడా ప్రచారంకు వద్దనే చెబుతున్నారట. కానీ టీడీపీ అగ్రనేతలు మాత్రం.. ప్రచారంకు పవన్ రావాల్సిందే అని ఒత్తిడి చేస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -