- Advertisement -
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై సర్వేలు చేయడంలో లగడపాటి రాజగోపాల్ దిట్ట. కొద్ది రోజుల క్రితం చేసిన సర్వేలో జనసేనకు ఓటు 5 శాతం మాత్రమే ఉందని తెలిపింది. అయితే పవన్ దానిపై స్పందించారు.జనసేన ప్రభావం కేవలం నాలుగైదు శాతం మాత్రమే ఉంటుందని అంటున్నారని… కానీ తమ బలం 18 శాతమని, ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పారు.
జనసేన కోసం తన ప్రాణాలనే పెట్టుబడిగా పెట్టానని పవన్ అన్నారు. తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిపోవాలనే ఆశతో తాను రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. బలమైన సిద్ధాంతాలను, విధానాలను తీసుకొస్తామని… పొలిటికల్ క్రిమినల్స్ ను, క్రిమినల్స్ ను తరిమేస్తామని అన్నారు.
