నంద్యాల ఉప ఎన్నికలో అదికారపార్టీ దౌర్జన్యాలకు అంతూ లేకుండా పోయింది. వైసీపీ అభ్యర్తి గెలుపు ఖాయమని తేలడంతో అధికార దుర్వినియేగానికి పాల్పడుతోంది. ప్రతి పక్ష పార్టీ నేతల ఇళ్ళపై పోలీసుల ద్వారా దాడులకు తెగబడుతోంది. వైసీపీలోకి గంగుల ప్రభాకర్రెడ్డి రావడాన్ని జీర్నించుకోలేని టీడీపీ ఆయనను,అతని అనుచరులను టార్గెట్గా చేసుకొని అరాచాకాలకు పాల్పడుతోంది.
ఉప ఎన్నిక గెలులో గోస్పాడు మండలం కీలకం అన్నవార్త మొదటినుంచి వినిపిస్తోంది. శిల్పాకు గంగుల సపోర్ట్ చేయడంతో టీడీపీ మరింత రగిలిపోతోంది. గంగుల ప్రతాప్ రెడ్డిని టీడీపీలో చేర్చుకొని వైసీపీకి దెబ్బకొట్టాలని చూసిన పచ్చపార్టీకి షాక్ తగిలింది. ఆయనతో పాటు అనుచరులు ఎవరూ రామని చెప్పడంతో ఖంగు తిన్న పార్టీ అరాచాకానికి తెరలేపింది.
తాజాగా గంగుల ప్రభాకర్రెడ్డిని ఏవిధంగా నైనా ఇరుకున పెట్టాలని పోలీసలును ఉపయేగించుకొని దాడుకుల పాల్పడింది. పోలీసులను పంపి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించింది. చివరకు ఏమి దొరకకపోవడంతో పోలీసులు వెనుతిరిగారు. ప్రభాకర్రెడ్డితోపాటు ఆయన అనుచరుల ఇల్లలో కూడా అనువనువూ గాలించారు. అక్కడ కూడా పోలీసులకు ఏవి దొకరలేదు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, భయబ్రాంతులకు గురి చేసినా భయపడేది లేదని ప్రభాకర్రెడ్డి కౌంటర్ ఇచ్చారు.