చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినిపై ఓ ప్రముఖ చానల్ లో ప్రసారమైన కథనం ఇప్పుడు చిలకలూరిపేట రాజకీయాలు హీటెక్కిచింది. ఆ చానల్ కథనంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే విడదల రజిని వర్గం మాత్రం అత్యంత దారుణంగా, దిగజారుడు కథనాన్ని ఆ చానల్ ప్రసారం చేసిందని సోషల్ మీడియాలో విరుచుకు పడుతున్నారు.
ఇంతకి ఆ చానల్ కథనం ఎంటంటే… ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై సోషల్ మీడియాలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ఎప్పుడూ ముందుండి ప్రచారం చేస్తుంటారు. సహజంగా ఎమ్మెల్యేలంతా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాను వాడుతూనే ఉంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి పరిపాలన, ఆయన తీసుకొస్తున్న పథకాలను విడదల రజిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ చానల్ విడదల రజిని తానే ఈ పథకాలన్నీ ప్రభుత్వం ద్వారా తీసుకొస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని చెప్పుతుంది.
చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని గతంలో టీడీపీ మహానాడుకు హాజరై ప్రసంగించారు. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును పొగుడుతూ మాట్లాడారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేశారు. అప్పటి వీడియాల్లో ఆమె మాట్లాడిన మాటలు, ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలను ఒక చోటకు చేర్చి అవే వీడియోలను ఇప్పుడు ఆ చానల్ ప్రసారం చేసింది.
ఏ అవినీతి మరక అంటకుండా ముందుకుసాగుతున్నా విడదల రజినిపై ఇప్పుడు అవసరం లేకపోయినా ఆ చానల్ ఇంత దారుణంగా వక్రీకరించి ప్రసారం చేయడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉందని… వారి సొంత కుల నాయకుల పల్లకీని మోస్తున్నరని… నరసరావుపేట పార్లమెంటుస్థాయి నేతను మెప్పించడానికే అని… ఒక విద్యా సంస్థ విదిల్చిన అడ్వర్టయిజ్మెంట్ డబ్బులకు కక్కుర్తిపడి ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేసిందని.. ఆ విద్యాసంస్థ ఉప సారథి ఎంతో ఒత్తిడి చేసి మరీ విడదల రజినిపై ఒక హాస్యాస్పదపు కథనాన్ని ప్రచారం చేయించి శుకనానందం పొందారని… ఒక బీసీ మహిళను రాజకీయంగా అణగదొక్కాలనే కుట్ర జరుతుందని.. ఇప్పుడు ఆ చానల్ పై సోషమీడియాలోసెటైర్స్ పెలుతున్నాయి.
ఇది వాస్తవంగా నరసరావుపేట పార్టీలో ఉన్న నాయకులే చేపించి ఉంటే… ఇది ఇంకేత్త వరకు దారితీస్తుందో… పార్టీలో అంతర్గత కుమ్ములాటలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవిదంగా స్పందించి చెక్ పెట్టుతుందో చూడాలి.