Monday, April 29, 2024
- Advertisement -

విడదల రజని పై గుర్రుగా వైసీపీ సీనియర్ లీడర్లు..!!

- Advertisement -

వైసీపీ పార్టీ లో ఇప్పుడు విడదల రజనీ పేరు బాగా వినపడుతుంది.. చిలకలూరి పేట ఎమ్మెల్యే అయిన ఆమె ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తోంది అని వైసీపీ పార్టీ లోని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు.. అయితే ఆమె చేసిన పనులు వారికి ఆగ్రహం తెప్పించాయనడాలో ఆశ్చర్యం లేదు.. వైసీపీ లో సోషల్ మీడియా ను ఎక్కువగా వాడుకుంటూ క్రేజ్ పెంచుకుంటున్న లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఆమె విడదల రజని అని చెప్పొచ్చు.. రాజకీయాల్లోకి లేటుగా వచ్చిన లేటెస్ట్ గా రాజకీయాలు చేయడం ఆమెకు అలవాటు.. పార్టీ ఆమె ఏం చేసినా, ఏం మాట్లాడిన అది ఓ సెన్సేషన్ అయిపోతుంది. కరోనా సమయంలో అందరూ ఇంటిపట్టునే ఉంది వైసీపీ కార్యకలాపాల్లో పాల్గొంటుంటే ఈమె మాత్రం ప్రజల్లోకి వెళ్లి అసలు సిసలు నాయకురాలు అనిపించుకుంటున్నారు. చిలకలూరి పేట నియోజక వర్గంలో ఘణ విజయం సాధించిన ఈమె ఎమ్మెల్యే గా అక్కడ ప్రజలకు ఏ లోటు లేకుండా చూసుకుంటుంది..

కరోనా వ్యాప్తి గురించి ఆమె సోషల్ మీడియా ను ఉపయోగించి తన నియోజక వర్గాలను అలర్ట్ చేస్తుంది అని తెలుస్తుంది. ఇక విడదల రజని పై సొంత పార్టీ నేతలు ఓ విషయం పై విమర్శితున్నారు.. ఏవైనా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేయడం సహజమే అయితే ఆ కటౌట్లపై కేవలం తన ఫోటో మాత్రమే వేసుకుని ఆ నియోజక వర్గంలో ఇతర నేతలకు, సీనియర్ నేతలకు గౌరవం ఇవ్వడం లేదని ఓ వాదన వినిపిస్తుంది.. అంతేకాదు కొన్ని కొన్ని సార్లు సీఎం జగన్ ఫోటో కూడా ఆ కటౌట్ల పై కనిపించాడంటే ఆమె దూకుడు ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు..

ఇలానే వెళ్తే ఆమెపై పెద్ద పెద్ద వారి కళ్ళు పడతాయని హెచ్చరిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఇటీవ‌ల జ‌రిగిన ఇద్దరు మంత్రుల కూర్పులో బీసీ కోటాలో త‌న‌కు ఛాన్స్ ద‌క్కించుకునేందుకు తుది వ‌ర‌కు కూడా ఆమె ప్రయ‌త్నాలు సాగించార‌ని అంటున్నారు. అయితే, ఈ ఛాన్స్ మిస్సవ‌డంతో వ‌చ్చే ఏడాది త‌ర్వాత జ‌రిగే మంత్రి వ‌ర్గం విస్తర‌ణ‌లో త‌నకు బెర్త్ ద‌క్కించుకునేందుకు ఇప్పటి నుంచే ఇలా ప్రచార ప‌ర్వంలో దూసుకుపోతే.. బెట‌ర‌ని ఆమె ఆలోచిస్తున్నట్టుగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి ప్రచారంలో వైఎస్సార్ సీపీ నేత‌ల‌ను ర‌జ‌నీ వెన‌క్కినెట్టార‌నే ప్రచారం జ‌రుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -