Saturday, May 4, 2024
- Advertisement -

లాలుతో రాహుల్ మటన్‌ పాలిటిక్స్!

- Advertisement -

రాహుల్ గాంధీ..ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు. ఇప్పటివరకు గాంధీ కుటుంబ వారసుడిగా ముద్ర ఉండగా ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకుని ముందుకుసాగుతున్నారు. లారీ ఎక్కడి డ్రైవర్ల కష్టాలు విన్న, కర్ణాటక సిటీ బస్సు ఎక్కి ప్రజలతో మాట్లాడినా,యుఎస్‌లో ట్రక్కు ఎక్కినా,వరి నాట్లు నాటినా వేసే ప్రతి అడుగులో తనను తాను ప్రజా నాయకుడిగా మలుచుకుంటున్నారు. ఇక రాహుల్‌ని మొదటి నుండి చూసిన వాళ్లు సైతం నివ్వెర పోయేలా తాము చూస్తున్నది రాహుల్‌నేనా అనేంతలా ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు.

ఇక భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ మైలేజ్ మరింతగా పెరిగిపోయింది. తన స్పీచ్‌లోనూ,ఏ చిన్న అవకాశం దొరికినా మోడీ సర్కార్‌ని ఇబ్బందులు పెట్టడమే కాదు ప్రజలతో ఇట్టే కలిసిపోతున్నారు. తాజాగా బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో కలిసి మటన్ వండారు రాహుల్. లాలూతో కలిసి మటన్ ముక్కల్లో మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసి రాహుల్ గరిటె తిప్పారు.

అనంతరం లాలూతో కలిసి భోజనం చేశారు. తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు. మటన్ వండిన రాహుల్ వీడియోను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేయగా వైరల్‌గా మారింది. ఇక రాహుల్ చేస్తున్న ప్రతి ప్రయత్నం ఆయన్ని ప్రజలకు మరింత దగ్గర చేస్తోంది.

ఇటీవల రాహుల్ గాంధీ…బెంగాలీ మార్కెట్, జామా మసీదు, ముఖర్జీ నగర్ వంటి ప్రాంతాల్లో సందర్చించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించడానికి హర్యానాలోని సోనేపట్‌ వచ్చిన రాహుల్ హర్యానాలోని ముర్తల్ నుంచి అంబాలా వరకు ట్రక్కులో ప్రయాణించారు. ఏది ఏమైనా రాహుల్ చేస్తున్న ప్రయత్నం ఆయన్ని అధికారానికి రోజురోజుకి దగ్గర చేరుస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -