Saturday, May 18, 2024
- Advertisement -

సొంత నియోజ‌క వ‌ర్గంలో ప‌రిటాల సునీత‌కు షాక్ …?

- Advertisement -

ఏపీ మంత్రి పరిటాల సునీతకు సొంత నియోజ‌క వ‌ర్గంలో పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. సొంత పార్టీ నేత‌ల‌నుంచి ఊహించ‌ని షాక్ ఎదుర‌య్యింది. తమపై మంత్రి సునీత సోదరుడు మురళీ ఆధిపత్యం చెలాయించ‌డ‌మేంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ద‌గ్గుపాటి దుర్గా ప్ర‌సాద్‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా గ్రామ‌ద‌ర్శిని కార్య‌క్ర‌మాన్ని ఎలా నిర్వ‌హిస్తారంటూ ఆయ‌న వ‌ర్గీయులు ఆందోళ‌న‌కు దిగారు.

మురళి ఆదేశాల మేరకు బండమీదపల్లిలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సిద్ధపడటంతో అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు.. ప్రొటోకాల్‌ ప్రకారం ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్‌కు సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అధికారులు కార్యక్రమం నిర్వహించకుండానే వెనుదిరిగారు. ఈ ఇష్యూ ప‌రిటాల వ‌ర్గంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -