Monday, April 29, 2024
- Advertisement -

ఏపీలో అత్య‌ధిక ధ‌నిక ఎంపీ సీటు ఏదో తెలుసా?

- Advertisement -

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అత్య‌ధిక ధ‌నిక ఎంపీ సీటు ఏదో మీకు తెలుసా?. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎలెక్ష‌న్స్ ఒక‌సారి ప‌రిశీలిస్తే అత్య‌ధిక ధ‌నిక ఎంపీ సీటు గుంటురు జిల్లాలో ఉన్న‌ట్లు గుర్తించారు. గుంటురు జిల్లాలో న‌ర్సారావు పేట లోక్‌స‌భ నియోజిక వ‌ర్గం ఏపీలో అత్య‌ధిక ధ‌నిక ఎంపీ సీటుగా రికార్డు సృష్టించింది. న‌ర్సారావు పేట లోక్‌స‌భకు పోటీ చేయ‌లంటే కోట్లు ఖ‌ర్చు పెట్టాలి. ఎక్క‌డైనా ఖ‌ర్చు పెట్టాలి అనే కదా మీ డౌట్‌. ఎలెక్ష‌న్స్ అప్పుడు డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌డం స‌ర్వ‌సాధార‌ణం. కాని ఇక్క‌డ పోటీ చేయ‌లంటే ధ‌న బ‌లం నేత‌లు అయి ఉండాలి.

వేరే నియోజిక వ‌ర్గంలో రూపాయి ఖ‌ర్చు అయితే, న‌ర్సారావు పేట లోక్‌స‌భకు మాత్రం ఐదు రూపాయిలు ఖ‌ర్చ అవుతుంద‌ని గ‌త ఎన్నిక‌లను బ‌ట్టి చూస్తే అర్థం అవుతుంది.అందుకే ఇక్క‌డ పోటీ చేసే రాజ‌కీయ పార్టీలు ధ‌న బ‌లం ఉన్న నేత‌ల‌ను బ‌రిలో దించుతారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ పోటీ చేసిన నాయ‌కులంద‌రు ధ‌నిక కుటుంబం నుండి వ‌చ్చిన వారే. ఇక ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల‌లో టీడీపీ-బీజేపీ ఉమ్మ‌డి అభ్య‌ర్థి గోక‌రాజు గంగారాజు విజ‌యం సాధించారు. 2019లో వ‌చ్చే ఎలెక్ష‌న్స్‌కు ఇప్ప‌టి నుండి స‌రైన అభ్య‌ర్థుల కోసం రాజ‌కీయ పార్టీలు వెతుకులాట ప్రారంభించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -