Thursday, May 2, 2024
- Advertisement -

ఈ చిన్నారి చేసిన ప‌నికి చ‌లించిన జ‌గ‌న్‌…

- Advertisement -

ఒక నాయకుడిమీద అభిమానం పెంచుకుంటే ఎంత వరకైనా వెల్తారు అభిమానులు. తన అభిమాన నాయకులకోసం ప్రాణాలను సైతం లెక్క చేయరు. అలాంటి సంఘ‌ట‌నే శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని కొత్తపేట క్రాస్ వద్ద జరిగింది.. జ‌గ‌న్ ను చూడాల‌న్న ఆ చిట్టిత‌ల్లి సంక‌ల్పం నెర‌వేరింది. దాని కోసం ఆ బాలిక చేసిన పని తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

ఈ పాప పేరు పేడాడ లలిత. ఊరు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని గుంజిలోవ. జర్జంగి స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. జగనన్న తన ఊరికి వచ్చాడని తెలుసుకున్న ఆ బాలిక, అన్న దగ్గరికి తీసుకెళ్లాలని కోరితే, తల్లిదండ్రులు కుదరదని చెప్పడంతో, ఆ పాప రెండు కిలోమీటర్ల పాటు పరిగెత్తి, సెక్యూరిటీని దాటుకుని జగన్ ను చేరుకున్న వేళ, జగన్ సైతం కొంతసేపు భావోద్వేగానికి లోనై, ఆ పాపను అక్కన చేర్చుకుని ఓదార్చారు.

ఏమైందో అర్థం కాక వైఎస్‌ జగన్‌ లలితను దగ్గరకు తీసుకుని.. ఏమైంది తల్లీ.. ఎందుకు ఏడుస్తున్నావ్‌.. అని అడిగాడు. అంతే ఆ పాప తీవ్ర భావోద్వేగానికి లోనైంది. పరుగెత్తి రావడంతో ఓపక్క గసపెడుతూ మరోపక్క వెక్కివెక్కి ఏడుస్తూ జగన్‌ను నడుంచుట్టేసుకుంది. దాంతో బాలిక ఆనందానికి అవ‌ధుల్లేవు.

నిన్ను చూస్తానని అమ్మానాన్నతో పందం కట్టానని, రెండు కిలోమీటర్లు పరిగెత్తడంతో ఏడుపు వచ్చిందని పాప చెప్పడంతో, ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్న జగన్ ఓదార్చారు. కాలు నొప్పిగా ఉందా? అని అడుగుతూ, ఆమె చెప్పులు తెగిపోయి ఉండటాన్ని చూసి జగన్ కూడా కాసేపు అక్కడే ఉండి, పాప తేరుకునేంత వరకూ ఆమెను పొదివి పట్టుకునే నిలబడిపోయారు.

ఆపై పాప వివరాలు అడిగి తెలుసుకుని, తానున్నానని, బాగా చదువుకోవాలని చెప్పి, పాపను క్షేమంగా ఇల్లు చేర్చాలని తన అనుచరులకు చెప్పి పంపారు. ఈ మొత్తం వ్యవహారం జరుగుతున్నంత సేపు మౌనంగా వీక్షించిన చుట్టుపక్కల వారందరూజై జగన్‌ అంటూ నినాదాలు హోరెత్తించారు. అవును.. నాయకుడంటే ఇలా ఉండాలని వ్యాఖ్యానించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -