వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను ఎదుర్కొనేందుకు ముప్పుతిప్పలు పడిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త ఆస్త్రం దొరికింది. దీంతో రోజాపైకి ఈ అస్త్రాన్ని ఎక్కు పెట్టనున్నారు. అమె ఎవరొ కాదు ఒకప్పటి టీడీపీ నేత శోభారాణి. టీడీపీ నుంచి ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చిన శోభారాణి, ప్రజారాజ్యం పార్టీ మూతపడ్డంతో కొన్నాళ్ళపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు .
ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి శోభారాణి రీ-ఎంట్రీ ఇచ్చారు. నిజానికి, టీడీపీ నుంచి రోజాపైకి ధీటుగా విమర్శనాస్త్రాలు సంధించేందుకు ఎమ్మెల్యే అనితను టీడీపీ అధినేత చంద్రబాబు ఉపయోగిస్తోన్న విషయం విదితమే. అయినాసరే, ఇంకాస్త ‘పవర్స పెంచేందుంకు శోభారాణికి ఆ ఛాన్స్ చంద్రబాబు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అన్నట్టు రోజా టీడీపీలోనూ, శోభారాణి ప్రజారాజ్యం పార్టీలోనూ వున్నప్పుడు ఈ ఇద్దరి మధ్యా ‘సంచరించిన’ విమర్శనాస్త్రాలు అన్నీ ఇన్నీ కావు. ఇద్దరూ తమ స్థాయిని మర్చిపోయి దుమ్మెత్తిపోసుకున్నారు. వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు.. ఓ దశలో బూతులు కూడా తిట్టుకున్నారు. మళ్ళీ ఆనాటి ఆ ఘోరమైన విమర్శల పరంపర ఇకపై చూడబోతున్నామా…?
అప్పట్లో శోభారాణితోపాటు, వాసిరెడ్డి పద్మజ కూడా ప్రజారాజ్యం పార్టీ తరుపున పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున శోభారాణితో సమానంగానే అప్పట్లో వాసిరెడ్డి పద్మ, రోజాపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈసారి ‘వెయిట్’ రోజా వైపు కాస్త మొగ్గు చూపుతున్నట్లే కన్పిస్తోంది.
అప్పటికి ఇప్పటికి తేడా గమనిస్తే అటువారు ఇటు….ఇటు వారు అటు ఉన్నారంతె. ప్రజారాజ్యం పార్టీ తరఫున శోభారాణితో సమానంగానే అప్పట్లో వాసిరెడ్డి పద్మ, రోజాపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈసారి ‘వెయిట్’ రోజా వైపు కాస్త మొగ్గు చూపుతున్నట్లే కన్పిస్తోంది.