Friday, May 17, 2024
- Advertisement -

బాబుకు మ‌రో షాక్ సిద్దం…ఆయ‌న‌బాట‌లో సీనియ‌ర్లు…

- Advertisement -

నంద్యాల నేత శిల్పాచక్రపాణి రెడ్డి టీడీపీకి రాజీనామ చేసి వైసీపీలో చేరి పార్టీకి షాక్ ఇచ్చారు.అయితె ఈ వ‌ల‌స‌లు ఇంత‌టితో ఆగేలాలేదు.ఈయ‌న ఎఫెక్ట్ బాబుకు నిద్ర‌లేకుండా చేస్తోంది. మొత్తం పార్టీపైనె ప్ర‌భావం చూపెలా ఉంది.మ‌రికొంత మందికి చ‌క్ర‌పాణి మార్గ‌ద‌ర్శం కానున్నారు. బాటలోనే మరింత మంది టిడిపి సీనియర్లు నడుస్తారా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అదే అనుమానం వస్తోంది.

బాబు అబ‌ద్ర‌తా భావంతో చ‌క్ర‌పాణిని దూరం చేసుకున్నారు. ఆయ‌న‌ దారిలోనే నడవటానికి టిడిపిలోని మరింతమంది సీనియర్లు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లా, కడప జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోని పలువురు సీనియర్లు నాయకత్వంపై తీవ్రస్ధాయిలో అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. అయితే, వివిధ కారణాల వల్ల బయటపడటం లేదు. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, కడప జిల్లాలో రామసుబ్బారెడ్డి లాంటి నేతలు వివిధ జిల్లాల్లో చాలామందే ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే.

ఫిరాయింపుల మీద ఆగ్రహంతో, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందో రాదో అన్న ఆందోళనతో సుమారు 60 మంది ఎంఎల్ఏలు, నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారంతా చంద్రబాబునాయుడు వైఖరితో మండిపోతున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు ఏం చేయలేక మౌనంగా ఉన్నారు. వారందరూ బహుశా నంద్యాల ఉపఎన్నిక ఫలితం కోసమే ఎదురు చూస్తున్నట్లు కనబడుతోంది. ఉప ఎన్నిక‌లో ఓడిపోతె అంద‌రు బాహ‌టంగానె విమ‌ర్శ‌లు చేయ‌డం మొదలు పెడ్తారు.అప్పుడు పార్టీలో దిక్కార స్వ‌రాలు పెరుగుతాయి.ఇది బాబుతోపాటు ,టీడీపీకి పెద్ద దెబ్బే అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -