Friday, April 26, 2024
- Advertisement -

వైసీపీలోకి ఆరుగురు ఎమ్మెల్యేలు.. బాబు ఏమంటారో..?

- Advertisement -

ఆప‌రేషన్ ఆక‌ర్ష్‌ చంద్రబాబు చెప్పట్టడంతో వైసీపీ ఎమ్మెల్యేలు టీడిపీ సైకిల్ ఎక్కారు. ఇప్పుడు అలా టీడీపీలోకి వెళ్లి ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందట. తాము తొందరపడి టీడీపీలోకి అడుగు వేసామా అని చర్చించుకుంటున్నారట. ఏపీని బాబు అభివృద్ది చేస్తారని టీడీపీలోకి వచ్చమని.. కానీ రాజకీయాలో జగన్ బెస్ట్ అని వారు అనుకుంతున్నారట. ఇప్పుడు ఇదే విషయం పెద్ద చర్చగా మారింది. ఆ ఎమ్మెల్యేలు జగన్ వద్దకు చేరేందుకు ఫీక్స్ అయ్యారట.

దాంతో ఇప్పుడు టీడీపీ నుంచి కనీసం ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు తిరిగి వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. అసలు సంగతిలోకి వెళ్తే.. బాబు పాలన బాగుందని రాష్ట్రం అభివృద్ధి చెందుతోంద‌ని పేర్కొంటూ .. వైసీపీని వీడి దాదాపు 21 మంది ఎమ్మెల్యేలు టీడిపీలోకి చేరారు. వీరి తోడు ఇద్దరు ఎంపీలు.. కొందరు ఎమ్మెల్సీలు కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే వీరు ఎందుకు పార్టీ మారారో తెలిస్న విషయమే. కొందరు పదవుల కోసం అయితే.. మరి కొందరు కేసుల నుంచి విముక్తి కోసం. అయితే ఇటివలే వారు ఆశించిన పదవులు దక్కపోవడంతో.. టీడీపీలో వలసలు పెరిగాయి. పోనీ నియోజకవర్గాల పునర్ విభజన జరుగుతుందా? అంటే అది జరిగే అవకశం లేదు.

దాంతో 2019 నాటికి టీడీపీలో ఉంటే క‌నీసం టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి అసలు కనిపించడం లేదు. ఈ విషయంను గమనించిన ఆరుగురు ఎమ్మెల్యేలు మళ్లీ సొంత గూటికి అయిన జగన్ వద్దకు చెరెందుకు ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. క‌ర్నూలు జిల్లాకు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు, కోస్తాకు చెందిన మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు వైసిపీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -