నిన్నటి వరకు టీడీపీ, పవన్ను టార్గెట్ చేసిన ప్రముఖ దర్శక, నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ్ ఈసారి వైసీపీనీ టార్గెట్ చేశారు. ఆయన ఏంమాట్లాడినా అది సంచలనమే. తాజాగా వైసీపీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ టీడీపీనీ తిట్టడం తప్ప వైసీపీ చేసింది ఏమేలేదన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతుంటే నాలుగేళ్ల నుంచి టీడీపీ చూస్తూ కూర్చుంది తప్ప, ఏం చేయలేదని అంటున్న వైసీపీ నేతలు, ఈ నాలుగేళ్లుగా వాళ్లు చేసిందీ శూన్యమని విమర్శించారు. ఢిల్లీలో రెండు సార్లు జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేశామని, ఏపీలో ఏదో చేస్తున్నామని వైసీపీ వాళ్లు చెబుతున్నారని…వారిలో చిత్తశుద్ధిలేదన్నారు.
వైసీపీ తమ పార్టీ ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోయిందన్న ఆయన, ఏపీకి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ ని తీసుకురాలేకపోయిందన్నారు. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీతో టీడీపీ కలిసి పనిచేస్తోంది. రాజ్యాధికారం వారి చేతికొచ్చింది కనుక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఐదేళ్లు నడుస్తుంది. కానీ, ప్రజల నమ్మకాన్ని సాధించాల్సిన అవసరం ఉన్నది వైసీపీమేదనే ఉందన్నారు.
చంద్రబాబును, టీడీపీని తిట్టడమో లేకపోతే అధికారంలోకి వచ్చాక ఏదో చేస్తామని చెప్పడమో తప్ప, నిజంగా మీరు (వైసీపీ) ఏం చేశారు? నిజాయతీగా ఆలోచించండి!’ అని తమ్మారెడ్డి విమర్శించారు. తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీనేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.